AP: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. క్లస్టర్ బేస్ అప్రోచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన గమ్యమని లోకేష్ స్పష్టం చేశారు.