మనసుకు నచ్చని వాతావరణం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు కొందరు అతిగా తింటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల ఇలా జరుగుతుందని, దీనివల్ల 'ఎమోషనల్ ఈటింగ్' ఏర్పడి, బింజ్ ఈటింగ్ డిజార్డర్ వంటి సమస్యలకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. డిప్రెషన్ను అధిగమించడానికి జీవనశైలి మార్పులు, వ్యాయామం, సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, మానసిక మద్దతు అవసరమని సూచిస్తున్నారు.