AP: కడప మేయర్గా పాకా సురేశ్ ఎన్నికయ్యారు. వైసీపీకి చెందిన 47వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ను ఆ పార్టీ కార్పొరేటర్లు పాకా సురేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ పోటీ చేయకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, కడప నగరంలో వైసీపీ తన పట్టును నిరూపించుకుంది.