గత కొంతకాలంగా విదేశీ జట్లు పాకిస్తాన్కు పర్యటనకు వచ్చి ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి దేశాలు తమ కీలక ఆటగాళ్లను పంపకుండా ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్లో పర్యటిస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకుడు ఒమైర్ అలవి, మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ స్థాయి దిగజారిందని, మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే, మాజీ చీఫ్ సెలక్టర్ హారూన్ రషీద్ మాత్రం సిరీస్ గెలుపుపైనే దృష్టి సారించాలని సూచించారు.