పాకిస్థానీ బ్యూటీ క్రీమ్ 'గోరీ'ని వాడడంతో భారత్లో పలువురు మహిళల కిడ్నీలు దెబ్బతిన్నట్లు ఓ రిపోర్ట్లో వెల్లడైంది. మహారాష్ట్ర నాగపూర్లో ఈ క్రీమ్ వాడిన 18 మంది మహిళల కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్లు తేలింది. ఈ క్రీమ్లో ప్రమాదకరమైన స్థాయిలో విషపూరితమైన పాదరసం, సీసం ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో మహారాష్ట్ర ఎఫ్డీఏ దీన్ని నిషేధించింది. అయితే పాక్లో తయారైన ఈ క్రీమ్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా, ఇది భారత్లోకి ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నించారు.