2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచించి, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్ సైనిక అధికారి లెఫ్ట్నెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను అజ్ఞాత సాయుధులు కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది యాత్రికులు మరణించారు. దాడి తర్వాత భారత సరిహద్దు విధులకు దూరం చేయబడిన దయాల్, ఆపరేషన్ ముగించుకుని వెళ్తుండగా కాల్పుల్లో మృతి చెందారు. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.