చిలకలూరిపేట చౌత్రా సెంటర్లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో శనివారం ఐమాక్స్ లైట్ల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానిక దుకాణదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు అరగంట పాటు మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. పెద్ద ప్రమాదం జరగనప్పటికీ, విద్యుత్ పరికరాల భద్రతపై అధికారులు దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.