గురువారం నాదెండ్ల మండల ప్రత్యేక అధికారిణిగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కారుమూరి అమల కుమారి నియమితులయ్యారు. మూడు రోజుల క్రితం నియమితులైన పల్నాడు జిల్లా మెప్మా పీడీ చాట్ల మురళి తన అయిష్టతను తెలపడంతో ఈ మార్పు జరిగినట్లు సమాచారం. అమల కుమారి చిరుమామిళ్ళ గ్రామంలో జరిగిన స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు.