తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డులో ఏర్పడిన కొండచరియల తొలగింపు పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కొండవీడు ఫారెస్ట్ బీట్ అధికారి పురుషోత్తమరాజు తెలిపారు. బుధవారం నుంచి ఘాట్ రోడ్ చెక్ పోస్టును తిరిగి ప్రారంభించి, పర్యాటకులకు కొండవీడు కోట సందర్శనకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో, కొండవీడు కోట సందర్శన తిరిగి ప్రారంభం కానుంది.