గుంటూరు నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 07 మందిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరిలో 05 మంది వాహనదారులకు మొత్తం రూ. 29,000 జరిమానాలు విధించారు. ఒక కారు డ్రైవర్ మరియు ఒక ఆటో డ్రైవర్ కు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.