గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆదివారం ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. అంబటిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీకి విన్నవించారు.