గుంటూరులోని D2 సెక్షన్ పరిధిలో విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నల్లచెరువు, గాంధీనగర్, సింహపురి ఎస్టేట్, బీజేటీ కాంపౌండ్, డీఎస్ నగర్, దర్గా మాన్యం ప్రాంతాలు ఈ అంతరాయానికి గురికానున్నాయి. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.