గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1950 రాష్ట్రపతి ఆర్డర్ను రద్దు చేయాలని, అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లకు విరుద్ధమని ఆయన అన్నారు. కులవ్యవస్థ వల్ల దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. దళితుల ఐక్యతతో ఈ అంశంపై ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.