రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి, జనాభా లెక్కల సేకరణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాలను చేపడతామని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీసీలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.