గుంటూరులోని అరండల్పేటలోగల ఖజానా జువెలరీ మాల్లో ఇద్దరు మహిళలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించి, రూ. 1 లక్ష విలువైన రెండు జతల చెంప సవరాలను దొంగిలించారు. ఈ ఘటనపై సేల్స్ గర్ల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో నగరంలో కలకలం రేగింది.