నూజెండ్ల మండలం చింతలచెరువు వద్ద శనివారం ఫోర్ వీలర్ ఆటో, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా గంగారానికి చెందిన వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడారు. వినుకొండ నుంచి గుంటూరుకు మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా, ఆయన మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.