మాచవరంలో భారీ చోరీ జరిగినట్లు వస్తున్న వార్తలను దాచేపల్లి సీఐ రాజేశ్ ఖండించారు. ఫిర్యాదు అందిన వెంటనే క్లూస్ టీంతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించగా, చోరీ జరిగిన ఆనవాళ్లు ఏవీ లభించలేదని తెలిపారు. లాకర్లో బంగారం, వెండి వస్తువులు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. నగదు విషయంలో అపోహలు ఉన్నాయని పేర్కొంటూ, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.