మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం మాచర్లలో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వైసీపీ రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపి, సీఎం చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.