టీడీపీలో గ్రామస్థాయి నుంచి పొలిట్బ్యూరో వరకు సమూల మార్పులు చేపడుతున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ప్రతి టర్మ్లో 33 శాతం మంది కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. "టీడీపీ 3.0 వర్షన్తో సరికొత్త పంథాలో సాగుతోంది. ఆధార్ తరహాలో సభ్యత్వ నంబర్ ద్వారా కార్యకర్తల పనితీరును గుర్తిస్తాం" అని లోకేశ్ పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తలకు ఉన్నత స్థానం కల్పించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.