తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు, నాణ్యతలేని విద్యపై నిరసన తెలిపిన విద్యార్థి నాయకులపై దాడులు చేయించారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో, బౌన్సర్ల ద్వారా విద్యార్థులను కిడ్నాప్ చేసి హింసించారని తెలిపారు. ఈ ఘటనపై మోహన్బాబు, ఆయన కుమారుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.