ఎండా కాలం సమీస్తున్న తరుణంలో ఎండ తాపానికి సరదా కోసం ఈతకు దిగి యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి ఈ తరహా ప్రమాదాలు పల్నాడులో ఎక్కువయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాచేపల్లిలో చెరువులో జీవాలను కడుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు అన్నదమ్ములు నీటమునిగి మృతి చెందగా, కారంపూడిలో రాజారావు అనే యువకుడు ఈతకు వెళ్లి మరణించాడు. చిలకలూరిపేటకు చెందిన మరో 5వ తరగతి విద్యార్థి నీటమునిగాడు.