వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంత్రి నారాయణ, రాజధాని ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ కలిశారు. రాజధాని ప్రాంతంలోని పలు కీలక అంశాలను, ముఖ్యంగా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని తాజా పరిస్థితులను, రైతుల విన్నపాలను ఎమ్మెల్యే భాష్యం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీ తుళ్ళూరులో జరిగింది.