గురువారం పెదకూరపాడు పోలీస్ స్టేషన్లో ABN ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై రాధాకృష్ణ, ABN ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికపై కఠిన చర్యలు తీసుకోవాలని, FIR నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.