పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలన విధ్వంసంతో ప్రారంభమైందని, అసత్య ప్రచారాలతో కూటమిపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు. పొన్నూరు ఘటనకు రాజకీయ రంగు పులిమి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రజల అభివృద్ధికే కట్టుబడి పనిచేస్తామని నరేంద్ర స్పష్టం చేశారు.