విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కే ఎల్ పి టోర్నమెంట్ పోటీల్లో పొన్నూరు నియోజకవర్గం, పెద్దకాకాని సెయింట్ జోసెఫ్ పిటిసారి విద్యార్థులు రాణించారు. రాజమోహన్ శిక్షణలో పాల్గొన్న హారిక, ఏకేశ్వర్, ధృతి శ్రీ లాస్య, హిమ కార్తికేయ చౌదరి సబ్ జూనియర్స్, ఉమెన్స్, మెన్స్ కాంపౌండ్, జూనియర్స్ ఇండియన్ రౌండ్ కేటగిరీల్లో తృతీయ, నాలుగవ స్థానాలను సాధించి బహుమతులు గెలుచుకున్నారు.