శనివారం రాత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు దారం అశోక్ కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్త లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ గాయపడిన వారిని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ శ్రేణుల దాడిని వారు తీవ్రంగా ఖండించారు.