రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న దాచేపల్లికి చెందిన మురళీకృష్ణ, ప్రధాన రహదారిపై ఉన్న ప్లాస్టిక్ డబ్బాను ఢీకొనడంతో అదుపుతప్పి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు రిఫర్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.