సత్తెనపల్లిలోని పెట్రోల్ బంక్ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించి, స్వయంగా వినియోగదారుల వాహనాలకు పెట్రోల్ నింపి ప్రజల్లో నమ్మకం కల్పించారు. ఇంధనంపై ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. అపోహలను నమ్మవద్దని సూచిస్తూ, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.