ఏనుగుపాలెంలో జరిగిన గుంటూరు శివ హత్య కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చింతల శ్రీను, చింతల సుబ్బారావు, వజ్జా వెంకట్రావు అనే ముగ్గురు నిందితులు పాత గొడవలు, అక్రమ సంబంధాల ప్రతీకారంతో శివను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రెండు గడ్డపారలు, ఒక కర్ర, బజాజ్ ప్లాటినా బైక్, ఎక్స్ప్రెల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డి. ఎస్. పీ హనుమంతరావు తెలిపారు.