లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ముగ్గురికి గాయాలు

3905చూసినవారు
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, ముగ్గురికి గాయాలు
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల సెంటర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ రవి (24), బస్సు ప్రయాణికుడు జాహిత్ (30), లారీ డ్రైవర్ కనకరాజు (49) గాయపడ్డారు. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్