ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గేట్లో సీట్ సాధించిన సత్తెనపల్లి యువకుడు

900చూసినవారు
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గేట్లో సీట్ సాధించిన సత్తెనపల్లి యువకుడు
సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ కైఫ్ ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ సీటు సాధించి ఘనత సాధించాడు. గేట్ పరీక్షలో జాతీయస్థాయిలో 393వ ర్యాంకు సాధించిన కైఫ్‌కు ఈ అవకాశం లభించింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 9. 27 సీజీపీఏతో ప్రతిభ కనబరిచాడు. పదో తరగతిలో కూడా 600కి 592 మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఈ విజయంపై తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కైఫ్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్