సీఆర్డీఏ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు, మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అమరావతి పనుల పురోగతిపై ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజధాని నిర్మాణ పనుల వేగం, నాణ్యతపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ భేటీ అమరావతి అభివృద్ధి పనులకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.