తెనాలి మండలం కొలకలూరు, ఖాజీపేట, హాఫ్ పేట, గుడివాడ గ్రామాల్లో బుధవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ కె. రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.