గురువారం గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఇనుప రమ్ములను ఢీకొట్టి అకస్మాత్తుగా ఆగడంతో, వెనుక వస్తున్న ద్విచక్ర వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు రోడ్డుపై పడి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.