వినుకొండ వారి పునుగుపల్లిలో ఒక పునుగుపిల్లి కనిపించింది. హస్సనాయునిపాలెంలో రైతు వెంకటేశ్వర్లు పొలం పనులు చేస్తుండగా ఈ అరుదైన జంతువు కనిపించింది. దానిని పట్టుకునే ప్రయత్నం విఫలమైంది. సాధారణంగా శేషాచలం అడవుల్లో కనిపించే ఈ పునుగుపిల్లి నుంచి తీసిన తైలాన్ని వేంకటేశ్వర స్వామి కైంకర్యానికి ఉపయోగిస్తారని సమాచారం.