AP: తిరుమల శ్రీవారి పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాను చేసిన తప్పుకు పరిహారంగా తన ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చినట్లు ఆయన తెలిపారు. దీనిపై కొందరు తప్పుగా ప్రచారం చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గత కొన్నేళ్లుగా తన కుటుంబం వేధింపులకు గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.