పార్కింగ్ విషయంలో వివాదం.. ఇద్దరు మృతి

25577చూసినవారు
పార్కింగ్ విషయంలో వివాదం.. ఇద్దరు మృతి
బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన డ్రైవర్ నబీ హుస్సేన్‌కు రోడ్డు పక్కన సత్తు అమ్ముకునే రవి చౌహాన్ వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రవి పదునైన ఆయుధంతో నబీ హుస్సేన్‌ గొంతు కోయడంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన జనం రవిని కొట్టి చంపారు. క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

సంబంధిత పోస్ట్