AP: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో పార్కింగ్ విషయంలో భక్తులపై దాడులు జరుగుతున్నాయి. పార్కింగ్ కాంట్రాక్టర్, సెక్యూరిటీ సిబ్బంది అధిక మొత్తంలో రుసుము వసూలు చేస్తూ, ప్రశ్నించిన భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. రూ.100 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తూ, డబ్బులు ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆలయంలో భక్తుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.