ప్రధాని
మోదీ వీడియో తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేసింది. మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. క్షమాపణ చెప్పకుంటే సేఫ్ హార్బర్ రక్షణ రద్దు చేస్తామని హెచ్చరించింది.
మోదీ వీడియో ఐదు గంటలపాటు అందుబాటులో లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. మెటా వివరణపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.