బొబ్బిలి పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయ పురోగతి సాధించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 70 లక్షల రూపాయలు అదనంగా వసూలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్ రామలక్ష్మి తెలిపారు. ఇంటి పన్నుల ద్వారా 5.13 కోట్లు, కుళాయి పన్నుల ద్వారా 60.69 లక్షలు వసూలైనట్లు వెల్లడించారు. పన్నుల వసూళ్లలో సిబ్బంది కృషిని అభినందించారు. ప్రజలకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.