గొల్లపల్లిలోని వేణుగోపాల మున్సిపల్ హైస్కూల్లో జనగణన-2027 మొదటి విడత శిక్షణ తరగతులు గురువారం (ఏప్రిల్ 9, 2026) జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీడీవో, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. జనగణనలో వివరాలను తప్పులు లేకుండా, ఖచ్చితత్వంతో నమోదు చేయాలని, ముఖ్యంగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సమాచార సేకరణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, గణన సిబ్బంది పాల్గొన్నారు.