ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలు.. ఐవిఆర్ఎస్ కాల్స్ పై అవగాహన

120చూసినవారు
ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలు.. ఐవిఆర్ఎస్ కాల్స్ పై అవగాహన
బొబ్బిలి మండలంలోని మెట్టవలస గ్రామంలో ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించే ఐవిఆర్ఎస్ (IVRS) ఫోన్ కాల్స్ గురించి శనివారం అవగాహన కల్పించారు. ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో అల్లు భాస్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహరి పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలు, పెన్షన్లు, సచివాలయ సేవలపై నేరుగా ప్రజలకే ఫోన్ కాల్స్ వస్తాయని అధికారులు వివరించారు. ప్రజలు తమకు అందుతున్న సేవలకు సంబంధించి మొబైల్‌కు వచ్చే ఐవిఆర్ఎస్ కాల్స్‌కు సరైన సమాధానం చెప్పడం ద్వారా సేవల నాణ్యతను పెంచవచ్చని, ఈ విధానం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజలు భయం లేకుండా తమ అభిప్రాయాలను పంచుకోవాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్