బొబ్బిలి పట్టణం 22వ వార్డు ప్రేమనగర్కు చెందిన రిక్షా కార్మికుడు ఆకుల లక్ష్మణ రిక్షా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మరమ్మతులు చేయించుకోలేకపోయిన లక్ష్మణ రిక్షాను ఫ్లైఓవర్పై ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) లక్ష్మణ వివరాలు తెలుసుకుని, వెంటనే రిక్షాను మరమ్మతు చేయించి అతనికి అందజేశారు. ఎమ్మెల్యే సహాయానికి లక్ష్మణ కృతజ్ఞతలు తెలిపారు.