విజయనగరం బిసివై జిల్లా కన్వీనర్గా కొత్త నియామకం

భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) విజయనగరం జిల్లా కన్వీనర్గా మరిశర్ల కృష్ణమూర్తి నాయుడును పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ నియమించారు. పార్టీ సిద్ధాంతాలపై ఆయనకున్న నిబద్ధత, ప్రజలతో సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని, రైతులు, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాడతానని తెలిపారు.
