విజయనగరం జిల్లా బొబ్బిలిలో, బొబ్బిలి డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ ఎస్హెచ్ఓ, ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల బ్యాగులను ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, ఈవ్టీజింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.