ఉగాది నాటికి మంజూరైన గృహాలన్నీ పూర్తిచేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల స్థాయి అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో, మండలాల వారీగా వారం వారీ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. ఇకపై ప్రతి వారం గృహ నిర్మాణ పురోగతిపై సమీక్షించి, లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.