ఆంధ్రుల రాజధాని అమరావతికి లోక్ సభ, రాజ్యసభల్లో చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల గర్వకారణమని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చరిత్రలో నిలిచిపోతుందని, ఏప్రిల్ 2 చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు.