గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావులు బుధవారం గజపతినగరంలో జరిగిన వైసీపీ పార్టీ కార్యాలయ సదస్సులో మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు అనుబంధ గ్రామ కమిటీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గార తౌడు, బూడి వెంకటరావు, కర్రి లక్ష్మణ, మండల సురేష్ పాల్గొన్నారు.