గుమ్మలక్మీపురం మండలం లక్కగూడ పంచాయతీ మొరం గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి నృత్యం చేశారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఆమె వారి సంప్రదాయ పాటలకు వారితో కలిసి డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజన సంప్రదాయాలు ఎంతోగానో ఆకట్టుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జయశ్రీ, ఏపీఎం సతీష్ కుమార్ పాల్గొన్నారు.