వంగర మండలం మడ్డువలస డ్యాంలో సోమవారం పొడువైన రెక్కలతో రాగండి జాతికి చెందిన చేప మత్స్యకారుడు గుడివాడ చిన్నంరాయుడు వలలో చిక్కింది. ఇంతవరకు ఇలాంటి చేపను చూడలేదని ఆయన తెలిపారు. అన్ ఈవెన్ గ్రోత్ వలన ఇలా రెక్కలు పొడువుగా ఉంటాయని ఫిషరిష్ అధికారి వెంకట్రావు వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షాలకు డ్యాంలోకి వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.